Posted on 2025-11-18 11:31:34
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఆదాయపన్ను శాఖ భారీ స్థాయిలో దాడులు చేపట్టింది. ప్రముఖ హోటల్ వ్యాపారులకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్ల ఇండ్లతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా శోధనలు జరుపుతున్నారు. నగరంలో కోట్ల రూపాయల టర్నోవర్తో పనిచేస్తున్న ప్రముఖ హోటల్ చైన్లు పిస్తా హౌస్, షాహ్ ఘౌస్ సహా మరికొన్ని పెద్ద వ్యాపార సంస్థలు ఈ సోదాల పరిధిలోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం వందల కోట్ల విలువైన వ్యాపారం జరిగే ఈ సంస్థల ఖాతాలకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, షాహ్ ఘౌస్ యజమానుల సహోదరుల ఇళ్లపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇవి యాఖుత్పుర ప్రాంతంలోని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ దాడులపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >