Posted on 2023-09-06 03:58:35
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్లో పెంపుడు కుక్క కాటుకు గురై 14 ఏళ్ల బాలుడు మృత్యువాత చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా బాలుడు బతకలేదు.
చివరికి తండ్రి ఒడిలో అంబులెన్స్లోనే బాలుడు ప్రాణాలు విడిచాడు. దీంతో తీవ్ర దు:ఖంతో బాలుడి తండ్రి.. తన కొడుకు చనిపోయాడంటూ కన్నీరుమున్నీరయ్యాడు. అభం శుభం తెలియని తన కొడుకు ఆ కుక్క బలితీసుకుందని.. దాన్ని పెంచుకునే ఇంటి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.విజయనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీలో యాకూబ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. యాకూబ్ కూలీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి ఎనిమిదో తరగతి చదువుతున్న అతని కుమారుడు చావెజ్ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నీళ్లను చూస్తే తెగ భయపడిపోయేవాడు. అంతేకాకుండా ఆ బాలుడు.. తినడం, త్రాగడం కూడా మానేశాడు. కొన్నిసార్లు కుక్క మొరిగినట్లుగా శబ్దాలు చేసేది.
అయితే చావెజ్ పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. కొంతకాలం క్రితం కుక్క కాటుకు గురయ్యాడని గుర్తించారు. కుక్క కాటు వల్ల ఇన్ఫెక్షన్ అతని శరీరమంతా వ్యాపించిందని తెలిపారు. ఆ కారణంగా బాలుడు వింతగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నాడు. ఇదే విషయమై కుటుంబ సభ్యులు చావెజ్ను ప్రశ్నించగా.. నెలన్నర క్రితం కుక్క కరిచిందని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు తనను కొడతారనే భయంతో కుక్క కరిచిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
ఈ విషయాన్ని విన్న కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కుక్క కాటుకు గురయ్యానని చెబితే.. సకాలంలో వైద్యం చేసి ఉండేవాళ్లమని చెప్పారు. దీంతో సెప్టెంబరు 1 నుండి కుటుంబ సభ్యులు బాలుడిని ఇతర వైద్యులకు చూపించారు. ఎక్కడికి వెళ్లినా వైద్యం చేయలేకపోతున్నారు. అయితే కుక్కకాటుకు చికిత్స చేసే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారని తెలుసుకుని వెళ్లారు. అక్కడ ఆ వైద్యుడికి చూపెట్టిన తర్వాత.. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో తండ్రి ఒడిలో బాలుడు చావెజ్ చనిపోయాడు. దీంతో తన బిడ్డను అలాంటి పరిస్థితిలో చూసి తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >