Posted on 2026-04-10 12:06:42
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డిలో ఎన్జీవోస్ కాలనీలో గల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో ఆయుర్వేద హోమియోపతి యునాని వైద్య శిబిరంను 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ క్యాంప్ చేపట్టి ఉచితంగా మందులు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మరియు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ గారి ఆదేశానుసారము ఈనెల 10వ తేదీన శుక్రవారం నాడు హోమియోపతి, ఆయుష్ డే నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, చర్మవ్యాధులు మధుమేహము, అర్షమోల, బ్లడ్ ప్రెషర్ మొదలగు దీర్ఘకాలిక అన్ని రకములైన వ్యాధులకు వైద్యులచే పరీక్షించి ఉచితంగా జరిపారు. ఆయుర్వేద, హోమియో, యునాని మందులు అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డి ఎం హెచ్ ఓ డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్లు (ఆయుర్వేదం), డాక్టర్ మాలికా జునైడి .(హోమియోపతి ), వైద్యురాలు నహిదా తరుణ్ణం (ఆయుర్వేదం) డాక్టర్ విజయ (యునాని)డాక్టర్ దేవయ్య(ప్రకృతి వైద్యం ) కిషోర్ (ఫార్మసిస్ట్). జ్యోత్స్న(pharm) సుమలత; రాజన్న, సిబ్బంది పాల్గొన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >