Posted on 2024-11-04 10:59:28
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లాలో మరోసారి ప్రేమోన్మాది ఘటన వెలుగుచూసింది. డిగ్రీ విద్యార్థినిపై పట్టపగలే కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజికి వచ్చిన ఓ యువతిపై చేతన్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.
అప్రమత్తమైన యువతి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంది. యువతి చేతికి తీవ్ర గాయం కాగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం నిందితుడు చేతన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
జూలూరుపాడు తాసిల్దార్ కి వడ్లు మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం
Posted On 2026-04-13 17:32:13
Readmore >
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం
Posted On 2026-04-13 17:30:28
Readmore >
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి - రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు
Posted On 2026-04-13 17:28:31
Readmore >
ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమానికి విచ్చేసిన టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-13 16:20:40
Readmore >