Posted on 2026-04-17 17:43:32
డివిజన్ అద్యక్ష, కార్యదర్శులుగా తాల్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ
డైలీ భారత్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని దిద్దుపుడి గ్రామంలోని కామ్రేడ్ సంక్రాంతి మధుసూదన్ రావు నగరంలోని కొత్తా నాగయ్య, కొరిన్ని రామయ్య ప్రాంగణం నందు శుక్రవారం తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ మహసభ జరిగింది. ఈ మహాసభలో తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా తాళ్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ ఎన్నికయ్యారు. డివిజన్ ఫ్యాక్షన్ కమిటీ సభ్యులుగా దొడ్డపనేని కృష్ణార్జునరావు, వింజం నాగభూషణం, వజ్జా రామారావు, దొంతెబోయిన నాగేశ్వరరావు, బొంతు సమత, భూక్యా వీరభద్రం, కిలారు శ్రీనివాసరావు, కొంగర సుధాకర్ ఎన్నికైనారు. డివిజన్ కమిటీ సభ్యులుగా కొప్పుల కృష్ణయ్య, చింతనిప్పు నరసింహారావు, చెరుకుమల్లి రాధా, గుడ్ల వెంకటేశ్వరరావు, భుక్యా లక్ష్మణ్, జి.సత్యనారాయణ రెడ్డి, సకినాల శ్రీను, ముళ్ల ఏకాంబరం, శీలం వెంకటరెడ్డి, చిత్తారు నాగరాజు, మల్లెంపాటి రామారావు, సంక్రాంతి పురుషోత్తం, అజ్మీర శోభన్ నాయక్, వెంకటాచారి ఎన్నికైనారు. మహాసభ ప్రారంభ సూచికగా కొత్త సీతారామయ్య రైతు సంఘం జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భుక్యా వీరభద్రం, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, రైతు సంఘం నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు, బాణాల శ్రీనివాసరావు, సోషల్ మీడియా వైరా డివిజన్ కన్వీనర్ గుడిమెట్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు
Posted On 2026-04-20 10:30:56
Readmore >
MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే
Posted On 2026-04-20 07:46:07
Readmore >
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >