Posted on 2026-04-19 22:21:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆధార్ కార్డు కలిగిన వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. యుఐడిఏఐ ప్రకటన ప్రకారం, 5 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ సేవను 5 నెలలపాటు ఉచితంగా అందిస్తోంది. 2026 సెప్టెంబర్ 30లోపు ఈ అప్డేట్ పూర్తిచేస్తే ఎటువంటి ఛార్జీలు ఉండవని తెలిపింది. ఈ ప్రక్రియలో వేలిముద్రలు, కనుపాప స్కాన్, ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయాలి. వయస్సు పెరుగుతున్న కొద్దీ వివరాల్లో మార్పులు రావడంతో ఇది తప్పనిసరి అవుతుందని అధికారులు చెబుతున్నారు. అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, గుర్తింపు సేవల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
Posted On 2026-04-19 22:22:58
Readmore >