Posted on 2026-04-02 08:38:24
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువై, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో, విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు సెస్ ఎండీ బిక్షపతి తెలిపారు. కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు, వినియోగదారుల పేరు మార్పు, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి సేవలను ఇప్పటి నుంచి ఏ మీసేవ కేంద్రంలో అయినా పొందవచ్చని ఎండీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులు తమ సమీప మీ సేవ కేంద్రంలోనే సమస్త విద్యుత్ పనులను పూర్తి చేసుకోవచ్చన్నారు .
మీ సేవ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ముఖ్య సేవలు...
కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు : గృహ, వ్యాపార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పుడు ప్రతి మీ సేవ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు స్వీకరణ నుండి మంజూరు వరకు మొత్తం ప్రక్రియ సులభతరంగా, పారదర్శకంగా నిర్వహించబడుతుంది.
వినియోగదారు పేరు మార్పు, విద్యుత్ బిల్లుల చెల్లింపు : మీ సేవ కేంద్రాల్లో నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చు.
ఇతర సేవలు : లోడ్ మార్పు, తాత్కాలిక కనెక్షన్, కనెక్షన్ తొలగింపు, మొదలైన అన్ని సేవలు కూడా మీ సేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు. వినియోగదారులు ఇప్పటి వరకు విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి ఇవ్వాల్సిన దరఖాస్తులను, ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న ఏ మీసేవ కేంద్రంలో అయినా ఇవ్వొచ్చు అన్నారు. వినియోగదారుల సౌకర్యమే మా ప్రథమ లక్ష్యం" అని, పారదర్శకంగా నిర్వహించబడతాయని ఆయన స్పష్టం చేశారు.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >