Posted on 2026-04-02 08:42:07
డైలీ భారత్ స్పెషల్: ఆంజనేయస్వామివారి చరిత్రకు ఆధార గ్రంథం పరాశర సంహిత, వశిష్ఠ మహర్షి కుమారుడైన శక్తి, అదృశ్యంతిల కుమారుడే పరాశరుడు. వ్యాసమహర్షికి తండ్రి. ఆయన రచించిన పరాశర సంహితలోని ఆరో పటలంలో హనుమజ్జననాన్ని గురించి వివరణలున్నాయి. అందులో... ఆంజనేయస్వామి వైశాఖ బహుళ దశమి శనివారం రోజు పూర్వాభాద్ర నక్షత్రంలో వైదృతీయోగంలో మధ్యాహ్న సమయములో కర్కాటక లగ్నంలో కౌండిన్య సగోత్రంలో జన్మించాడు. అంజనాదేవి. వాయుదేవుల కుమారుడైన ఆంజనేయస్వామి వారు జన్మించిన వైశాఖ బహుళ దశమినాడు హనుమజ్జయంతి పండుగగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే ఆంజనేయస్వామి జన్మదినాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష పూర్ణిమనాడు ఉత్తర భారతదేశంలో జరుపుకోవడం ఆచారం. ఈ విధంగా ఉత్తరాదివారు హనుమజ్జయంతిగా జరుపుకునే చైత్ర పూర్ణిమను దక్షిణదేశంలో ప్రధానంగా తెలుగువారు హనుమద్విజయోత్సవ దినంగా జరుపుకుంటారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >