Posted on 2026-06-05 21:39:54
9 మందికి జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష
డైలీ భారత్, బూర్గంపహాడ్ : బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
పట్టుబడిన 11 మందిని శుక్రవారం భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జి శివ నాయక్ గారు ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి 9 మందికి జరిమానా విధించగా, ఇద్దరు వ్యక్తులకు ఒక రోజు జైలు శిక్షతో పాటు వంద రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఎస్ఐ మేడా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్ట్యా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు" అని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడపవద్దు. మీ ప్రాణాలు, ఇతరుల ప్రాణాలు కాపాడండని హితవు పలికారు. ద్వి చక్రవాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >