Posted on 2026-03-31 05:34:18
ప్రధాన రహదారిపై తెగిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన తేజ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తంగలపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల సమయంలో సిరిసిల్ల డిఎస్పీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రాత్రి సమయంలో వచ్చిన గాలి తడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్లు తెగి పడి ఉండగా,అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తూ అటు వైపు వెళ్తుండగా వాహన డ్రైవర్ తేజ పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.వాహనాన్ని ఆపి ప్రమాదాన్ని అంచనా వేసి డిఎస్పీ కి తెలియజేయాగ వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి వైర్లను సరిచేయడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమై వ్యవహరించి డ్రైవర్ తేజ చూపిన చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు పోలీస్ అధికారులు అభినందించారు.డ్రైవర్ అంటే కేవలం వాహనం నడిపేవారే కాకుండా,అప్రమత్తతతో ప్రజల ప్రాణాలను కాపాడగల బాధ్యతగల వ్యక్తి అని తేజ నిరూపించారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >