Posted on 2026-03-09 08:28:46
మహిళామూర్తులకు బిజెపినేత "గాయత్రి" ఆధ్వర్యంలో ఘనసన్మానం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పునర్కరించుకుని బిజెపి నాయకురాలు సముద్రాల గాయత్రి ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆదివారం కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్, గాజులరాజం బస్తి పరిధిలో గల తన ఇంటి వద్ద 60 సంవత్సరాలు దాటిన వృద్ధ మహిళలకు పట్టు శాలువా కప్పి వారికి నూతన వస్త్రాలని అందజేశారు. ఈ సందర్భంగా సదరు మహిళల చే ఆశీస్సులు తీసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. నారీ శక్తులుగా ప్రతి రంగంలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు, మహిళా సాధికారత సాధించేందుకు ప్రతి ఒక్కరం పునరంకితమవుదామని వివరించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ సీనియర్ సిటిజన్ మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >