| Daily భారత్
Logo




రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

News

Posted on 2026-02-21 15:38:30

Share: Share


రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

చిన్న పిల్లలకు అవగాహన కల్పించిన సైఫాబాద్ పోలీసులు

డైలీ భారత్, హైదరాబాద్: పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను అప్రమత్తం చేసే లక్ష్యంతో సైఫాబాద్ పోలీసులు నేడు రవీంద్ర భారతిలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్డీకాపూల్‌లోని కంగారా కిడ్స్ పాఠశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సైఫాబాద్ ఏసీపీ సంజయ్, ఎస్.హెచ్.ఓ ఏ. సీతయ్య, ఎస్.ఐ నవీన్ మరియు ఇతర పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో జరిగింది.

సదస్సును ఉద్దేశించి ఏసీపీ సంజయ్ మాట్లాడుతూ, నిత్యం జరిగే సైబర్ మోసాల పట్ల విద్యార్థులకు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు పేరుతో జరిగే మోసాలను ఆయన వివరించారు.

ముఖ్యమైన సూచనలు:

•ఓటీపీ (OTP) భద్రత: ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఓటీపీని ఎవరికీ షేర్ చేయకూడదు.

•బ్యాంక్ మోసాల పట్ల జాగ్రత్త: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని, అందుకు అంగీకారంగా 1 లేదా 2 నొక్కాలని వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

•అపరిచితులను నమ్మవద్దు: ఫోన్ ద్వారా వచ్చే అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మవద్దు.

•నేరుగా సంప్రదించండి: బ్యాంక్ సంబంధిత పనులు ఏవైనా ఉంటే, ఫోన్ కాల్స్ ద్వారా కాకుండా నేరుగా మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌ని కలిసి వివరాలు తెలుసుకోవడం సురక్షితం అని తెలిపారు.

వినూత్న రీతిలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సు పట్ల పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >