| Daily భారత్
Logo




స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

News

Posted on 2026-08-02 07:32:52

Share: Share


స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

డైలీ భారత్, గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో రూబీ వైట్ (ఇంగ్లాండ్) ను సాక్షి 5-0 తేడాతో మట్టికరిపించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా బంగారు పతకం సాధించింది. ఫైనల్లో కెనడాకు చెందిన మేరీ అల్-అహ్మదీహ్ 4-1తో తేడాతో ఓడించి స్వర్ణం ఎగరేసుకుపోయింది.

మహిళల 70 కేజీల విభాగం ఫైనల్లో అరుంధతి చౌదరి స్వర్ణం గెల్చుకుంది. ఇంగ్లాండ్కు చెందిన చాంటెల్ రీడ్ పై అరుంధతి 5-0 తేడాతో విజయం సాధించింది. దీంతో బాక్సింగ్ లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా పసిడి పతకాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గో హైయిన్ (Lovlina Borgohain) రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఎమ్మా సూ గ్రీన్ట్రీ (ఆస్ట్రేలియా) చేతిలో లవ్లీనా ఓడింది. జూడోలో మహిళల 63 కేజీల విభాగంలో స్కై నోస్టర్ (సౌతాఫ్రికా)ను ఓడించి ఉన్నతి శర్మ కాంస్య పతకం సొంతం చేసుకుంది. 

భారత్ ఓవరాల్ గా ఇప్పటివరకు 11 స్వర్ణాలు, 16 రజతాలు, 8 కాంస్య పతకాలు సాధించి మెడల్స్ టాలీలో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది.

Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >