Posted on 2026-01-10 20:12:36
పబ్లిక్ అండ్ హెల్త్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి కొరకై అభివృద్ధి పనుల కోసం జరుగుతున్న పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించద్దని పబ్లిక్ అండ్ హెల్త్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో భాగంగా ప్రజలకు భవిష్యత్తులో యూజీడి పనుల వల్ల మ్యాన్ హోల్స్ పనుల ఏర్పాటులో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి తావివ్వకుండా పనులు చేపట్టాలని నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో వాటర్ వర్క్స్, నీటి ట్యాంకుల పనుల కు సంబంధించి నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన అన్ని నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేసి త్వరత కట్టిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనుల్లో ఏమాత్రం రాజీ పడకుండా అన్ని పనులు నాణ్యతతో చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా పనులు చేస్తే తాను సహించ చేయించబోనని ఆయన స్పష్టం చేశారు. అలాగే టి యు ఎఫ్ ఐ డి సి ఫండ్ కింద అరవై కోట్లు మంజూరయ్యాయని, అందులో ప్రతి డివిజన్ కు ఒక కోటి రూపాయల చొప్పున అభివృద్ధి, మరమ్మత్తుల పనుల కోసం టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు, కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రామర్తి చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా అవసరాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని కాంట్రాక్టర్లు, అందుకు సంబంధించిన అధికారులు బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో పనులు పూర్తి చేయాలని అధికారులను సుతి మెత్తగా మందలించారు. నగర అభివృద్దే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, ఇన్చార్జి మున్సిపల్ ఈ ఈ నగేష్ రెడ్డి పబ్లిక్ హెల్త్ ఏ ఈ శంకర్ సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >