| Daily భారత్
Logo




రూ.10 కోట్లతో కాలభైరవ ఆలయ అభివృద్ధి చేపడతా

News

Posted on 2026-01-10 20:16:17

Share: Share


రూ.10 కోట్లతో కాలభైరవ ఆలయ అభివృద్ధి చేపడతా

ప్రతి భక్తుడు అలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సహాయం అందించాలి

నూతన పాలకవర్గo సభ్యులు ఆలయ అభివృద్ధికి నిస్వార్థంతో పనిచేయాలి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

డైలీ భారత్, కామారెడ్డి:దక్షిణ కాశీగా పేరుగాంచిన కాలభైరవ స్వామి అభివృద్ధికి 10 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేపడుతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం కాలభైరవ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఎంతో ప్రాచీన, మహి మాణిత్వం గల చరిత్ర కలిగిన కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రతిభక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నూతన పాలకవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. పదవులు అనేవి శాశ్వతం కాదని అవకాశం వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని మంచి పేరు ప్రఖ్యా తులు తెచ్చుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, లా దృష్టికి తీసుకెళ్ళాను నిధుల మంజూరు కి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను ఇక్కడే పెరిగిన పరిసరాలు ఉన్నాయని తన చిన్ననాటి జ్ఞాపకాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వివరించారు. ఎంతోమంది భక్తులు కాలభైరవుని పూజిస్తారని ఎంతో మహిమలు కలిగిన కాలభైరవుని పూజిస్తే అడ్డంకులు తొలగడమే కాకుండా ఎంతో అభివృద్ధి చెందుతామన్నారు. తమ కుటుంబం కూడా కాలభైరవుడు నీ భక్తుల మేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఉందని అభివృద్ధి చేసి యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్గా చింతల శంకర్, ఆలయ కమిటీ సభ్యులను ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు , మాజీ సింగిల్ విండో చైర్మన్లు, ఎల్లారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు గిరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, పద్మశాలి సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >