| Daily భారత్
Logo




చెన్నారావుపేటలో బయటపడిన ఏవో దందా ?

News

Posted on 2026-01-10 18:08:46

Share: Share


చెన్నారావుపేటలో బయటపడిన ఏవో దందా ?

సోషల్ మీడియాలో వైరల్ అయిన అధికారి ఆడియో సంభాషణ

"క్షమించండి.. మళ్లీ జరగదు" అంటూ సర్పంచ్కు రిక్వెస్ట్

డైలీ భారత్, వరంగల్ జిల్లా:  చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండ గ్రామంలోయూరియా కొరత మధ్య అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏఓ) టోకెన్లను అక్రమంగా విక్రయించాడన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతులకు కేటాయించాల్సిన యూరియా టోకెన్లు దళారుల చేతుల్లో ప్రత్యక్షమవ్వడంతో అధికారుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామ పంచాయతీల వద్ద రైతులు టోకెన్లు రాయించుకున్నప్పటికీ, జనవరి 6న పెద్ద సంఖ్యలో టోకెన్లు రైతులకు కాకుండా ఇతరులకు కేటాయించబడ్డాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏఈవో సంతకంతో పెద్ద మొత్తంలో టోకెన్లు వెలుగులోకి రావడం అనుమానాలకు తావిస్తోంది.

సర్పంచ్-ఏఓ ఆడియో వైరల్

ఈ అంశాన్ని రైతులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా, సర్పంచ్ మండల ఏఓకు ఫోన్ చేసి వివరణ కోరారు. "రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? టోకెన్లు డబ్బులకు అమ్మారా?" అని ప్రశ్నించగా, ఏఓ తన తప్పును అంగీకరిస్తూ "నాకు తెలియకుండా తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి.. మళ్లీ రిపీట్ కాకుండా చూస్తాను, దండం పెడతా" అంటూ బ్రతిమాలినట్లు ఆ ఆడియోలో వినిపిస్తోంది.

అయితే, అధికారికంగా సర్పంచ్ వివరణ కోరినప్పుడు మాత్రం "టోకెన్లు ఎలా మిస్ అయ్యాయో తెలియదు" అంటూ ఏఓ చాకచక్యంగా తప్పించుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఏఓ. స్వయంగా ఈ అక్రమానికి పాల్పడ్డాడా? లేక ఏఈవోలతో కలిసి వ్యవహారం నడిపించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రైతుల ఆవేదన

యాసంగి పంటల సమయంలో యూరియా కొరత తీవ్రమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా సరైన సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో టోకెన్ల అక్రమ విక్రయం జరగడం వల్ల అసలైన రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ రైతులకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చిన నేపథ్యంలో, ఈ ఆరోపణలపై మండల, జిల్లా స్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరతతో ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతాంగానికి ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >