Posted on 2025-12-10 17:15:11
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల:ఈ రోజు జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బి అండ్ జి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి బి అండ్ జి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గుజ్జె శివరామ్ అధ్యక్షత వహించారు, మానవ హక్కులు, అవినీతి నిరోధక చర్యలు, సమాజంలో ప్రతి పౌరుడికి కల్పించబడవలసిన మౌలిక హక్కుల గురించి వక్తలు వివరించారు.
ఈ సందర్భంగా గుజ్జె శివరామ్ మాట్లాడుతూ
మానవ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, హక్కుల ఉల్లంఘనపై ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. అవినీతిని ఎదుర్కొనేందుకు సంఘం నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సభ్యులు కరంపూరి సాయన్న, రాచకొండ మహేష్, చెట్టిపల్లి కృష్ణ, సజ్జనం శ్యామ్ సుందర్, ఆనంతుల రాజు,గుగ్గిళ్ల అనిల్ కుమార్ రాపెల్లి రాజు, కోడం బాలకిషన్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కార్యక్రమం శాంతియుతంగా, ఉత్సాహభరితంగా సాగి, మానవ హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించింది.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >