| Daily భారత్
Logo




కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

News

Posted on 2025-12-07 14:24:59

Share: Share


కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్టానికి ఆయన చేసింది శూన్యం

బిజెపి మహా ధర్నాపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కేంద్ర మంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన బిజెపి పార్టీ హైదరాబాద్లో ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి ఏ ఒక్క అభివృద్ధి పనులు చేపట్టని అసమర్ధత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆ బిజెపి పార్టీ నేతలు ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజలతో శభాష్ కొట్టించుకుంటుందని ఇది చూసి ఓర్వలేక బిజెపి నేతలు మహా ధర్నా పేరిట ప్రజలను ముఖ్యంగా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. ఇందుకు ఉదాహరణనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కనీసం బీజేపీ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేని కిషన్ రెడ్డి ఆలోచించాలన్నారు. గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటున్నాం అని అన్నారు. ప్రజల మెప్పుపొంది ప్రజల ముందు గర్వంగా నిల్చున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వాకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో రాష్టాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారన్నారు. ఒకవైపు వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వచ్చే మూడేళ్లలో ఇచ్చిన హామీలు అన్ని తప్పకుండా నెరవేరుస్తామన్నారు.

Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >