| Daily భారత్
Logo




పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

News

Posted on 2025-12-07 08:40:10

Share: Share


పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్ న్యూస్, ఇంటర్నెట్ డెస్క్:పర్యాటక రాష్ట్రం గోవాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి గోవాలోని ఓ నైట్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో దాదాపు 23 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అర్పోరా ( Arpora, Goa) ప్రాంతంలోని బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 23 మంది మరణించగా అందులో నలుగురు పర్యాటకులు, మిగతా అందరూ క్లబ్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయి, సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. అటు సంఘటన స్థలానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ వచ్చి పరిశీలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపతి మురుము కూడా ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే గోవా మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. గోవాలో అగ్ని ప్రమాదం బారిన పడి మరణించిన కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు వెల్లడించారు. అలాగే క్షతగాత్రులకు 50 వేల రూపాయల చొప్పున PMNRF నిధుల నుంచి పరిహారం అందించనున్నట్లు పోస్ట్ పెట్టారు.


#goa #Arpora #beach 

Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >