| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన మత్స్య శాఖ అధికారులు

News

Posted on 2025-10-17 19:45:05

Share: Share


ఏసీబీకి చిక్కిన మత్స్య శాఖ అధికారులు

డైలీ భారత్ న్యూస్, హన్మకొండ: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లో నూతన సభ్యులను నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన హనుమకొండ జిల్లా మత్స్యశాఖ అధికారులను శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే నర్సంపేట మాదన్నపేటకు చెందిన మత్స్య పారిశ్రా మిక సంఘంలో నూతన సభ్యుల పేర్లను నమోదు చేయాలని ఆ సంఘం 2023లో జిల్లా కార్యా లయంలో వినతిపత్రం సమర్పించారు. అయితే అప్పటి అధికారి హైదరాబాద్ ప్రధాన కార్యాలవానికి పంపించేందుకు అన్ని సిద్ధం చేశాడు. ఈ క్రమంలోనే ఆ అధికారి బదిలీపై వెళ్లిపోయాడు. ఆ స్థానంలో నాగమణి వీధిలో చేరి సంవత్సరన్నర అయింది. అయితే గత అధికారి నమోదు చేయాలని సభ్యుల లిస్టు ఇచ్చామని ప్రస్తుత అధికారులు నమోదు చేయాలని సంఘ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఫైల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలనికి పంపించారు. అయితే అక్కడ అధికారులు జిల్లా పరిధిలోనే నమోదు చేసుకునే అధికారం జిల్లా డిఎఫ్ ఓ కు ఉందని తిరిగి ఆ ఫైలును పంపించారు. ఇదే అదనంగా భావించిన డిఎఫ్ నాగమణి సొసైటీ నుంచి రూ.80 వేల రూపాయలు లంచాన్ని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో సొసైటీ అధ్యక్షులు ఈ విషయంపై ఏసీబీ నాశ్రయించాడు. అందులో భాగంగానే శుక్రవారం కార్యాలయంలో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ హరీష్, డీ ఎఫ్ ఓ నాగమణి డబ్బులు తీసు కుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా  పట్టుకున్నారు.జిల్లా అధికారిని నాగమణి ఆదేశాల మేరకు కొత్త సభ్యులను సొసైటీలో చేర్చడం కోసం తను లంచం డిమాండ్ చేసినట్లు హరీష్ ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని శనివారం ఏసీబీ కోర్ట్ లో హాజరు పరచ నున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి సాంబయ్య తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ తో పాటు ఎస్సై, కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >
Image 1

సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు

Posted On 2026-04-11 08:51:32

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎస్బిఐ ఎటిఎం మిషన్ మాయం

Posted On 2026-04-11 08:33:02

Readmore >
Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >