Posted on 2026-04-11 08:51:32
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో, సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు వద్ద కొత్తగా 33/11కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ అనుమతులు మంజూరు చేసిందని రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి తెలిపారు. ఈ సందర్బంగా బిక్షపతి మాట్లాడుతూ.. ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి మొత్తం రూ. 2,81,48,000/- (రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు) నిధులు కేటాయించారు. ఈ కేంద్రంలో 1x5.0 ఎంవిఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఈ సబ్స్టేషన్ నుండి 4 కొత్త 11కేవీ ఫీడర్లను (ఫీడర్-1, 2, 3, 4) నిర్మించనున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ , లోడ్ విపరీతంగా పెరుగుతోంది. క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈ తెలిపారు.
ఈ కొత్త సబ్స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా సిరిసిల్ల మండలంలోని వేలాది మంది వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు.
కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు
Posted On 2026-04-11 10:47:57
Readmore >
సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డులో రూ. 2.81 కోట్లతో కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్ మంజూరు
Posted On 2026-04-11 08:51:32
Readmore >
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >