Posted on 2026-04-10 17:20:16
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రేపల్లెవాడ - గానుగపాడు గ్రామల మధ్యలో ఉన్న ఎదుళ్ళ వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ అనుమతులు లేకుండా రేపల్లెవాడ గ్రామంలోని ఎదుళ్ళ వాగు నుంచి ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే ఇద్దరు డ్రైవర్ల పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >