Posted on 2025-07-07 21:36:14
అవాక్కైనా అధికారులు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్ : అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఏకంగా జాతీయ రహదారిపై ఆందోళన చేయడంతో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలనకు అదనపు కలెక్టర్ విక్టర్ ను అదేశించారు. కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వంట గదిని, స్టోర్ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలసి మద్యహ్న భోజనం చేశారు. ఆయన తినే భోజనంలోనే పురుగులు రావడంతో అధికారులు అవాక్కయ్యారు. విద్యార్థులకు హస్టల్ లలో సన్నబియ్యం, నాన్ వెజ్ మెనూ అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. బియ్యంను ప్రభుత్వం సరఫరా చేస్తుండగా ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ ఇస్తుండగా పురుగులు ఎలా వచ్చాయనే సంశయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినీలు పురుగులు వస్తున్నాయని రోడ్డెక్కగా, అదనపు కలెక్టర్ తో పాటు అధికారులు మధ్యాహ్నం భోజనం చేస్తే అందులో పురుగులు రావడంతో అధికారుల పర్యవేక్షణ ఎలా ఉందో అనే విషయం తేట తెల్లమైంది. పురుగుల అన్నంను విద్యార్థులకు వండి వార్పుతున్న గిరిజన బాలికల గురుకుల శాల అధికారులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు అనుకుంటారో వేచి చూడాలి.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >