Posted on 2025-05-01 10:17:16
డైలీ భారత్, బోయినపల్లి: పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘనత వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది.
ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచింది. ఈ విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.
కాగా నిన్న తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. మధ్యాహ్నం రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి పదో తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే సత్తా చాటారు.‘పది’ ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు ఆధిపత్యం సాధించారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >