Posted on 2025-04-29 13:15:08
డైలీ భారత్, హైదరాబాద్:శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వివరాలను మీడియాకు వివరించారు. ఈ నెల 20వ తేదీన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదు దారుడు, అతని కార్యకర్తను తప్పించేందుకు శామీర్ పేట్ ఎస్ఐ పరశురామ్ నాయక్ 2లక్షలు లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. దీంతో ఫిర్యాదు దారుడు ఈ నెల 23వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు. అప్పటికే 21వ తేదీన 2 లక్షల రూపాయలు లంచం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పరశురామ్ కారులో ఇవగ, మరో సారి ఫోన్ చేసి అదనంగా మరో 25 వేలు కావాలని డిమాండ్ చేయగా ఫిర్యాదుడు 22 వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని అన్నారు. సోమవారం మరో 22 వేల రూపాయలు పోలీస్ స్టేషన్ లోని చెత్త బుట్టలో వేసి వెళ్ళిపోవాలని ఎస్ఐ ఫిర్యాదు దారుడుకి సూచించారని చెప్పారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఫిర్యాదు దారుడు చెత్త బుట్టలో వేసి వెళ్లిపోగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ 2 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ పరశురామ్ ను పట్టుకున్నామన్నాడు. దీంతో ఎస్ఐ పరశురామ్ పై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయ మూర్తి ఎదుట హాజరు పరిచామన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా వాట్స్ అప్ నంబర్ 9440446106 సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >