| Daily భారత్
Logo




విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

News

Posted on 2026-04-20 13:57:43

Share: Share


విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

డైలీ భారత్, మహబూబ్ నగర్: జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం మహబూబ్‌నగర్‌లోని ఎస్.వి.ఎస్ వైద్య కళాశాలలో యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డి.ఎస్.పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇటువంటి అనైతిక చర్యలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసాన్ని దెబ్బతీస్తాయని, సమాజంలో వారి ప్రతిష్టను తగ్గిస్తాయని తెలిపారు.

విద్యార్థులు పరస్పరం గౌరవం, సహకారం, స్నేహభావంతో ఉండాలని సూచిస్తూ, కొత్తగా చేరిన విద్యార్థులను ఆత్మీయంగా స్వాగతించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కళాశాలల్లో ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం నెలకొల్పడం కోసం ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్నారు.

ర్యాగింగ్‌కు సంబంధించి ఏవైనా ఘటనలు గమనించినప్పుడు వెంటనే కాలేజ్ యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం అందించాలని, బాధితులు భయపడకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న యాంటీ-ర్యాగింగ్ చట్టాలు విద్యార్థుల రక్షణ కోసం ఉన్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ భూపాల్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

#MahabubnagarPolice #antiragging

Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-04-21 19:56:02

Readmore >
Image 1

జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

Posted On 2026-04-21 19:53:11

Readmore >
Image 1

సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-04-21 18:31:56

Readmore >
Image 1

జిల్లాలో ఒకే రోజు 58 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-04-21 18:28:04

Readmore >
Image 1

హాస్టల్ విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ ఆందోళన

Posted On 2026-04-21 18:25:47

Readmore >
Image 1

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-04-21 17:08:06

Readmore >
Image 1

ఐవిఎఫ్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

Posted On 2026-04-21 17:02:20

Readmore >