| Daily భారత్
Logo




పెద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు... దంపతుల దుర్మరణం

News

Posted on 2026-04-06 10:19:24

Share: Share


పెద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు... దంపతుల దుర్మరణం

వృద్ధ దంపతులు, ఇద్దరు చిన్నారులను రక్షించిన స్థానిక యువకులు.

వెలగతోడులో విషాద ఛాయలు

డైలీ భారత్, మండపేట: మండపేట మండలం తాపేశ్వరం శివారు పేకేటి పాకలు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న మృతుడి తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులను స్థానిక యువకులు సాహసోపేతంగా రక్షించారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామమైన వెలగతోడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మండపేట రూరల్ సీఐ దొరరాజు, ఎస్సై కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం… మండపేట మండలం వెలగతోడు గ్రామానికి చెందిన బోగిళ్ల వీర వెంకట సతీష్ (40) రాజమహేంద్రవరం పేపర్‌మిల్లులో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 3న కాకినాడలో జరిగిన కుటుంబ వివాహ వేడుకలకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అక్కడి నుంచి ఆదివారం రాత్రి తమ స్వగ్రామం వెలగతోడుకు కారులో బయలుదేరారు.

కారు సతీష్ స్వయంగా నడుపుతున్నారు. ముందు సీటులో ఆయన పక్కన భార్య పద్మ (36) కూర్చుండగా, వెనుక సీట్లలో సతీష్ తండ్రి వెంకట్రావు, తల్లి పద్మ, కుమారులు మోక్షజ్ఞ, జితేష్ ప్రయాణిస్తున్నారు. మండపేట నుంచి పేకేటి పాకలు రహదారిలో వెలగతోడు వైపు వెళ్తుండగా, పేకేటి పాకలు సమీపంలోని పెద్ద కాల్వలోకి కారు అదుపు తప్పి దూసుకుపోయింది.

ప్రమాదంలో కారు ముందుభాగం కాల్వ నీటిలో కూరుకుపోగా, వెనుక భాగం పైకి కనిపించింది. ఈ సమయంలో అక్కడున్న స్థానిక యువకులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వృద్ధ దంపతులు, ఇద్దరు చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే డ్రైవింగ్ సీటులో ఉన్న సతీష్, ఆయన భార్య పద్మ నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న మండపేట రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సాయంతో కారును బయటకు తీయించారు. అనంతరం మృతదేహాలను వెలికి తీసి మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్ తెలిపారు.

ఒకే ప్రమాదంలో గ్రామానికి చెందిన యువ దంపతులు మృతి చెందడంతో వెలగతోడులో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో గ్రామం మౌనవిలాపంలో మునిగిపోయింది.

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >