Posted on 2026-04-01 10:11:18
పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆగ్రహం
దమ్మపేట గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం చికెన్ బగారా రైస్ అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. వడ్డించిన ఆహారాన్ని రుచి చూసి నాణ్యత లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” అని ప్రశ్నిస్తూ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్మేకర్ కూర సరిగా వండకపోవడం, రుచి లోపించడం గమనించి విద్యార్థులకు పోషక విలువలతో ఆహారం అందించాలని ఆదేశించారు.
చిన్న పాఠశాలల్లో కూడా నాణ్యమైన ఆహారం అందిస్తున్నప్పుడు ఇక్కడ లోపాలు ఉండటం తగదని పేర్కొని, వెంటనే సరిచేయాలని సూచించారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాన్ని పరిశీలించి, ట్యాపులు లేక నీరు వృథా అవుతున్న అంశంపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంఈఓ జగదీష్, ఉపాధ్యాయురాలు స్టెల్లా, వార్డు సభ్యురాలు దుర్గ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #Education #MiddayMeal #Telangana
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >