Posted on 2026-04-01 15:41:18
పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆగ్రహం
దమ్మపేట గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం చికెన్ బగారా రైస్ అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. వడ్డించిన ఆహారాన్ని రుచి చూసి నాణ్యత లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“మీ పిల్లలకు కూడా ఇలానే భోజనం పెడతారా?” అని ప్రశ్నిస్తూ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్మేకర్ కూర సరిగా వండకపోవడం, రుచి లోపించడం గమనించి విద్యార్థులకు పోషక విలువలతో ఆహారం అందించాలని ఆదేశించారు.
చిన్న పాఠశాలల్లో కూడా నాణ్యమైన ఆహారం అందిస్తున్నప్పుడు ఇక్కడ లోపాలు ఉండటం తగదని పేర్కొని, వెంటనే సరిచేయాలని సూచించారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశాన్ని పరిశీలించి, ట్యాపులు లేక నీరు వృథా అవుతున్న అంశంపై వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో తహసీల్దార్ రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంఈఓ జగదీష్, ఉపాధ్యాయురాలు స్టెల్లా, వార్డు సభ్యురాలు దుర్గ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
#BhadradriKothagudem #Education #MiddayMeal #Telangana
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >