Posted on 2026-03-31 17:12:14
మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని విజయవాడ తరలించాము
మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
డైలీ భారత్, కృష్ణా జిల్లా: గతేడాది అక్టోబరు నెలలో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచిన వారి దగ్గర నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నామని, వాటిని మంగళవారం కోర్టులో సబ్మిట్ చేయటానికి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసిన క్రమంలో పేలినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలి ఐదుగురికి గాయాలు కావటంతో సంఘటనా ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీజ్ చేసిన టపాసులను కోర్టులో సబ్మిట్ చేసే క్రమంలో కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఎస్ఐ దుర్గాంజనేయులుకు స్వల్ప గాయాలు కాగా, ముగ్గురిని విజయవాడ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ పార్వతీ, హెడ్ కానిస్టేబుల్ తేజ చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్ కు దూరంగా ఉంచటం జరిగిందని, కోర్టు ఆర్డర్స్ రావటంతో వాటిని కోర్టులో సబ్మిట్ చేయటానికి తీసిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాదమికంగా నిర్ధారించటం జరిగిందన్నారు. రాష్ట్ర హోం మంత్రి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత లు తీసుకుంటామని తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >