Posted on 2026-03-30 16:39:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్కు చెందిన భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ను బీఆర్ఎస్ కొత్తగూడెం మజీ మండల అధ్యక్షులు ఎండీ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, స్మారక చిహ్నాన్ని అందజేశారు.
సీఐ నరేష్ కుమార్ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపుతున్న చొరవను ప్రశంసించారు.
ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మజీ మండల అధ్యక్షుడు ఎండి హుస్సేన్, నాయకులు నజీర్,శ్యామ్, ఖాదర్, సతీష్, మోహన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ ఆత్మీయ వాతావరణంలో సాగింది.
ఆడ పిల్లలను జన్మనిస్తుందనే సాకుతో భార్య ఇద్దరు పిల్లలను హత్య.... వరంగల్ పోలీస్ కమిషనర్
Posted On 2026-04-10 09:22:18
Readmore >
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్
Posted On 2026-04-10 08:29:28
Readmore >
AO మరియు PACS CEO కి రైతుల తరఫున వినతి పత్రం అందజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంగారెడ్డి సర్పంచ్ చంద్ర రెడ్డి
Posted On 2026-04-10 08:06:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు అరెస్ట్
Posted On 2026-04-10 07:32:15
Readmore >
విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-10 07:25:14
Readmore >
ఘనంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు, మెడికల్ క్యాంప్ నిర్వహణ
Posted On 2026-04-10 06:36:42
Readmore >