| Daily భారత్
Logo




గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు

News

Posted on 2026-03-30 22:06:48

Share: Share


గంజాయి కేసులలో నిందితుడిపై పీడీయాక్ట్ నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన షేక్.మున్వర్  గంజాయి అక్రమ రవాణా చేస్తున్నందుకు 2024,2025 సంవత్సరాలలో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులు,2024 లో లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ నందు  మరొకకేసు 2024లో ఏడుళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదు చేయడం జరిగింది. చివరిగా 2025 ఏప్రిల్ నెలలో దుండిగల్ పిఎస్ లో 98 కేజీల గంజాయిని సరఫరా చేస్తూ దొరకగాఅక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఐదు కేసులలో షేక్.మున్వర్  మొత్తం 287 కేజీల గంజాయిను సరఫరా చేస్తూ పాల్పడుతున్నందున అతనిపై పి ఐ టి ఎన్ డి పి సి ఎస్ యాక్ట్ (పీడియాక్ట్) కొరకు పాల్వంచ సబ్ డివిజన్ డిఎస్పీ ఆర్.సతీష్ కుమార్ సూచనలతో సీఐ కె.సతీష్  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  పర్యవేక్షణలో సంబంధించిన ఆధారాలను క్షుణ్ణంగా  పరిశీలించి సీఐడి అడిషనల్ డీజిపి చారు సిన్హా ఐపిఎస్ 16.02.2026 నాడు డిటెన్షన్ ఆర్డర్ (నిర్భంద ఉత్తర్వులు) ను జారీ చేయగా 18.02.2026 నాడు డిటెన్షన్ ఆర్డర్ ప్రతులను షేక్.మున్వర్ కు అందజేసి చేసి అతనిని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.

17.03.2026 తేదీన అడ్వైజరీ బోర్డు (సలహా మండలి) షేక్.మున్వర్ పై వచ్చిన నిర్భంద ఉత్తర్వులపై విచారణ జరిపి భౌతిక,సాంకేతిక ఆధారాలను పరిశీలించి, పి ఐ టి ఎన్ డి పి సి ఎస్  (పిడియాక్ట్) యాక్ట్ ను సమర్థిస్తూ  సంవత్సర కాలం చర్లపల్లి జైల్లో నిర్బంధించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుత సమాజంలో ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని,ప్రజల ఆరోగ్యంపై తీవ్ర  దుష్ప్రభావాన్ని చూపించే గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను సేవించినా,సరఫరా(రవాణా) చేయడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని,వారిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో పీడియాక్ట్ లను నమోదు చేయడం జరుగుతుందని సీఐ సతీష్ తెలిపారు.అంతేకాకుండా పట్టుబడిన నిందితులు గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను కూడా కోర్టు ఉత్తర్వులతో జప్తు చేయడం జరుగుతుందని తెలియజేశారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >