| Daily భారత్
Logo




పట్టపగలే మట్టి అక్రమ రవాణా

News

Posted on 2026-03-11 18:39:30

Share: Share


పట్టపగలే మట్టి  అక్రమ రవాణా

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు? 

డైలీ భారత్, కేశంపేట: కేశంపేట మండల పరిధిలోని పోల్కోనిగుట్ట తండా గ్రామపంచాయతీలో సర్వే నంబర్ 32 లో మట్టి రవాణా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. పట్టపగలే యథేచ్ఛగా సాగుతున్న ఈ దందాపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారీ యంత్రాలతో తవ్వకాలు

గత కొన్ని రోజులుగా పోల్కోనిగుట్ట తండా పరిసరాల్లో రెండు పెద్ద ఇటాచి (Hitachi) యంత్రాలతో భూమిని తవ్వుతూ, పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వాహనాలు నిరంతరం మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం.

అధికారులు ఏం చేస్తున్నారు?

"మా కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?" అని గ్రామస్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోందా? లేక వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామస్తుల ఆవేదన:

 "భారీ వాహనాల రాకపోకలతో రహదారులు ధ్వంసమవడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి."

తక్షణ చర్యలు అవసరం

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >