Posted on 2026-02-24 03:35:06
25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాల పంపిణీ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :లైసెన్సుడు సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకొని, పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన జిల్లాకు చెందిన 66 మంది సర్వేయర్లకు లైసెన్సులు గతంలో అందజేసిందని గుర్తు చేశారు. గత ఏడాది జిల్లాకు చెందిన సివిల్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 50 రోజుల పాటు శిక్షణ ప్రభుత్వం అందించిందని, వారిలో శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలో పాస్ అయిన 25 మందికి లైసెన్స్ పత్రాలను అందించామని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. లైసెన్స్ పొందిన వారు అందరూ వారికి కేటాయించిన మండలాల్లో అందుబాటులో ఉండాలని, ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్, నటరాజ్ సిబ్బంది ఉన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >