Posted on 2026-02-21 13:27:09
మున్సిపల్ చైర్మన్ ను కలిసిన మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,ఎం.డి.ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టణంలో తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇబ్రహీం మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వను కోరారు. శనివారం వారు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో మసీదుల వద్ద పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు, నిరంతర మంచినీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. నేతల విన్నపంపై మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. పట్టణంలో రంజాన్ వేడుకలు ప్రశాంతంగా, ఘనంగా జరిగేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టి, సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా చైర్మన్ హామీ ఇచ్చారు.
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >