Posted on 2026-02-21 17:57:09
మున్సిపల్ చైర్మన్ ను కలిసిన మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,ఎం.డి.ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టణంలో తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇబ్రహీం మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వను కోరారు. శనివారం వారు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో మసీదుల వద్ద పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు, నిరంతర మంచినీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. నేతల విన్నపంపై మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. పట్టణంలో రంజాన్ వేడుకలు ప్రశాంతంగా, ఘనంగా జరిగేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టి, సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా చైర్మన్ హామీ ఇచ్చారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >