Posted on 2026-02-09 15:11:49
హౌసింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్ష.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూంలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో హౌసింగ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పీఆర్ శాఖల అధికారులతో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వేములవాడ, కొండాపూర్, మద్దికుంట, బద్దెనపల్లి, తంగళ్ళపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా వాటిపై సమీక్షించారు. ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో ఆరా తీశారు. ఆయా ఇండ్ల పనులను గృహ నిర్మాణ శాఖ ఆద్వర్యంలో చేపట్టి ..త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సాజిద్, ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >