Posted on 2026-02-09 07:41:12
మోదీ నాయకత్వమే లక్ష్యంగా ముందుకు
డైలీ భారత్, సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 38వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఈ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోరా శైలజ శ్రీహరి ,ఈరోజు తన మద్దతుదారులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
"బీజేపీని గెలిపిద్దాం - 38వ వార్డును ప్రగతి పథంలో నడిపిద్దాం" అనే నినాదాలతో ప్రచార ప్రాంగణం మార్మోగింది.
ప్రచారంలో భాగంగా వార్డులోని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న శైలజ శ్రీహరి, తమను గెలిపిస్తే వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
డప్పు చప్పుళ్లు, పార్టీ జెండాలతో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఒక సేవకురాలిగా మీ ముందుకు వస్తున్నానని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >