Posted on 2026-02-07 04:51:31
డైలీ భారత్, తిరుపతి: నగరంలోని ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జరుగుతున్న పనులు, చేయాల్సిన పనుల పురోగతిపై అధికారులు కమిషనర్ కు వివరించారు.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ..
నగరంలో తాను పర్యటించిన సమయంలో ప్రజల నుండి చెప్పిన సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల మేరకు ప్రాధాన్యత గల పనులకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయా వార్డుల్లో ప్రజలకు అవసరమైన సి. సి. రోడ్లు, డ్రైనేజి కాలువల నిర్మాణం, కాలువల మరమ్మత్తులకు, ప్రజా ఉపయోగకరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఎదో ఇచ్చారు, చేద్దాం అని కాకుండా అధికారులు తమ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చేయాల్సిన పనులకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, డి.ఈ. లు మహేష్, రాజు, మధు, వెంకట ప్రసాద్, లలిత, శిల్ప, రమణ, టెక్నికల్ ఆఫీసర్ రజని పాల్గొన్నారు.
#Tirupati #MCT #maud_municipal #cdma_municipal #development #apcm #NCBN
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >