Posted on 2026-01-10 09:18:30
డైలీ భారత్ స్పెషల్:
కవితా శీర్షిక పూర్వ వైభవం ఎక్కడ
నవ నాగరికత పేరుతో
చెట్లను నరికిన పాపానికి
పక్షుల జాతి అంతరించ పోయె
యంత్ర పరికరాలు వచ్చి
బసవన్న కనుమరుగై పోయె
రసాయన ఎరువులు మోపై
పెండతట్ట మూలవడి ములుగవట్టె
వరి కోత యంత్రాలు వచ్చి
కొడవళ్ళు మూలవడి తుప్పుపట్టే
బొరు మొటర్ల పుణ్యమా లేక
ప్రకృతి పచ్చదనాన్ని అంతం చేసిన పుణ్యమా
స్వచ్చమైన ఉట నీళ్లు ఎండ మావులు అయ్యే
పాడిలేక పనిలేక జనాలు వలసబాట పట్టి
పల్లెల్లోని రచ్చబండ కనుమరుగై పోయె
ఇవన్ని మనకై మనమే చేసుకున్న తప్పిదాలు
ఇప్పటికైనా మన తప్పులు సరిచేసుకుంటూ
పకృతిని పది కాలాలు కాపాడుకుందాం
రచన:
శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >