| Daily భారత్
Logo




పోలీస్ వర్సెస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో 43 పరుగులతో విజయం సాధించిన పోలీస్ టీం

Sports

Posted on 2026-01-09 16:40:03

Share: Share


పోలీస్ వర్సెస్ ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో 43 పరుగులతో విజయం సాధించిన పోలీస్ టీం

తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రెస్ టీంకు సంబంధించి మూడు వికెట్లు పడగొట్టిన సిపి

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. మొదటగా పోలీస్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా  132 ప్రత్యర్థి టీం అయిన ప్రెస్  టార్గెట్ విధించారు. 133 పరుగుల లక్ష్యంతో బరిలో ప్రెస్ లెవెన్ జట్టు 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులు మాత్రమే చేసింది. పోలీస్ లెవెన్ జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోలీస్ లెవెన్ జట్టులో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బౌలింగ్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 3 ఓవర్లలో మూడు వికెట్లు తీసి పోలీస్ జట్టు విజయానికి దోహదపడ్డారు. అనంతరం మ్యాచ్ ముగిసిన తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ బ్యాట్స్మెన్, ఉత్తమ బౌలర్ కు బహుమానం అందించారు. పోలీస్ జట్టులో 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఎస్సై కిరణ్ కుమార్ బెస్ట్ బ్యాట్ మేన్ గా బహుమతి అందుకున్నారు. ప్రెస్ లెవెన్ నుండి ఉత్తమ బౌలర్గా శ్యామ్ నిలిచారు. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు నిత్యం పోలీస్, ప్రెస్ వారు తమ తమ విధుల నిమిత్తం ఒత్తిడికి లోనవుతుంటారని ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచులు నిర్వహించుకోవడం మంచి సంప్రదాయమని వక్తలు పేర్కొన్నారు. అనంతరం ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన ప్రెస్ అండ్ పోలీస్ మిత్రులకు మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ బసవరెడ్డి, ఏసిపి రాజా వెంకటరెడ్డి సిఐలు ఎస్సైలు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >