Posted on 2026-01-05 11:55:47
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తప్పుల తడకగా ఏర్పాటుచేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ జాబితాను సరిదిద్దాలని టిడిపి మాజీ పట్టణ అధ్యక్షులు అంబికా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఓటర్ లిస్టులో అవకతవకలు పెద్ద మొత్తంలో జరిగాయని దాన్ని వెంటనే సరిదిద్దాలని, కొన్ని చోట్ల అయితే మున్సిపల్ డివిజన్లు వార్డుల వారీగా గల్లంతయాయని ఆయన అన్నారు. త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఓటర్ లిస్టులో ఒక డివిజన్లో ఉన్న ఓటర్ను సంబంధం లేకుండా మరో డివిజన్లోకి ఎలా ఏ విధంగా కలిపారు అంటూ ఆయన ప్రశ్నించారు. తారుమారైన ఓటర్ జాబితా ను సరిచేయాలని దీనికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడు లేని విధంగా ఇలా ఓటర్ జాబితాలో అవకతవకలు తిరగడాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు. ఓటర్ జాబితా పూర్తిగా సరిదిద్దాకేనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోకి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు సి రాజు, బీసీ సెల్ నాయకులు రవికుమార్ పాటిల్, నాయకులు బాలాజీ గౌడ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >