Posted on 2023-12-30 18:04:31
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని సిద్దార్థ పాఠశాలలో సిరిసిల్ల టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ROAD SAFETY EDUCATION CLASSES లో భాగంగా ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్ బోర్డ్స్,MV act,హెల్మెట్, వాహనాల చట్టాలు, మొదలగు అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ట్ట్రాఫిక్ ఆర్.ఎస్ రాజు మాట్లాడుతూ...
విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నియమాల మీద ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అవగాహన ఉండాలని తద్వారా రోడ్ ప్రమాదాలను నియంత్రించ వచ్చు అనే ఆలోచనలో జిల్లా ఎస్పీ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించడం జరుగుతున్నారు విద్యార్థిని విద్యార్థులు హెల్మెట్ వినియెగం, ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై మీ తల్లిదండ్రులకు,బంధువులకు స్నేహితులకు,తోటి వారికి అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాల మీద పరీక్ష నిర్వహించి అందులో మొదటి ,రెండవ,మూడవ స్థానంలో వచ్చిన వారికి బహమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సేఫర్ ఇండియన్ రోడ్,ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ అనే ఎన్జీవో ఓఝా,సిధార్థ పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్, సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >