Posted on 2023-12-28 06:30:27
డైలీ భారత్, తమిళనాడు:తమిళనాడు కెప్టెన్ విజయకాంత్ (71) గురువారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాజాగా కరోనా బారిన పడ్డారు.
దీంతో ఆయనకు చెన్నైలోని ఓ హాస్సిటల్లో వెంటిలేటర్ మీద చికిత్సను అందిస్తూ వచ్చారు. అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఆయన కన్నుమూశారు.
ఆయన తుది శ్వాస విడిచినట్టుగా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయన మరణ వార్త తెలుసుకున్నడీడీఎంకే శ్రేణులు కన్నీరుమున్నీర వుతన్నారు.
గత కొన్ని రోజులుగా విజయకాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. రీసెంట్గానే ఆయన ఆరోగ్యం మీద రకరకాల పుకార్లు వచ్చాయి.
ఆయన హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటూ ఉంటే.. మరణించాడనే రూమర్లు కూడా వచ్చాయి. అందరూ ఆయన చనిపోయినట్టుగా నెట్టింట్లో ట్వీట్లు కూడా పెట్టారు. కానీ వెంటనే హాస్పిటల్ వర్గాలు స్పం దించాయి. ఆయన ఇంకా బతికే ఉన్నారని అప్డేట్ ఇచ్చింది.
కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్ ఇక ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన మరణంతో డీడీఎంకే కార్యకర్తలు, కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. గుండె బద్దలైనట్టుగా ఉందంటూ నెటిజన్లు ఆయన మృతి పట్ల తీవ్ర దు:ఖాన్ని వ్యక్తపరు స్తున్నారు.
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >