Posted on 2025-07-12 17:42:43
క్రికెట్ మ్యాచ్ లను ప్రారంభించి క్రికెట్ ఆడిన జిల్లా ఎస్పీ..
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెండ్లి క్రికెట్ మ్యాచ్ లలో పోలీస్ A టీమ్ vs సిరిసిల్ల ప్రెస్ టీమ్ మరియు పోలీస్ B టీమ్ vs వేములవాడ ప్రెస్ టీమ్ ల మద్య ఉత్సాహంగా కొనసాగిన క్రికెట్ పోటీలు.
శనివారం రోజున జిల్లాలోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ మరియు ప్రెస్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లను జిల్లా ఎస్పీ ప్రారంభించారు
మొదటగా పోలీస్ A టీమ్ మరియు సిరిసిల్ల ప్రెస్ మధ్య జరిగిన మ్యాచ్ లో పోలీస్ A టీమ్ గెలుపొందగా ,రెండవ మ్యాచ్ లో పోలీస్ B టీమ్ మరియు వేములవాడ ప్రెస్ మధ్య జరుగగా వేములవాడ ప్రెస్ టీమ్ గెలుపొందగా ఫైనల్ మ్యాచ్ పోలీస్ A టీమ్ మరియు వేములవాడ ప్రెస్ టీమ్ అడగా మొదట బ్యాటింగ్ చేసిన పోలీస్ A టీమ్ నిర్ణిత 10 ఓవర్లలో 77 పరుగులు చేయగా వేములవాడ ప్రెస్ జట్టు నిర్ణిత 10.ఓవర్లలో 73 పరుగులు చేయగా పోలీస్ A టీమ్ 4 పరుగుల తేడాతో గెలుపొందడం జరిగింది.
మొదటి ప్లేస్ పోలీస్ A టీమ్.
రెండవ ప్లేస్ వేములవాడ ప్రెస్ టీమ్.
మూడవ ప్లేస్ సిరిసిల్ల ప్రెస్ టీమ్.
అనంతరం జట్ల సభ్యులకు జిల్లా ఎస్పీ గారు బహమతులు అందించారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారు అని అన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి సస్సబంధాలు ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.
క్రికెట్ మ్యాచ్ ప్రారంభించే ముందు సిరిసిల్ల tv9 రిపోర్టర్ ప్రసాద్ ఇటీవల గుండెపోటుతో మరణించగా 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
ఈకార్యక్రమంలో పోలీస్ అధికారులు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >