Posted on 2025-07-12 17:12:19
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ లో దాదాపు తమ తాత ముత్తాతల తరం నుండి ఏళ్ల తరబడిగా ఊర పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని సర్వ సమాజ్ కమిటీ సభ్యుడు రవి తెలిపారు. పూర్వం గత్తర్ (ప్లేగు వ్యాధి) రావడంతో చాలామంది చనిపోయారని చెప్పారు. దీంతో అన్ని కులాల వారు కలిసి సర్వ సమాజ్ కమిటీగా ఏర్పడి గ్రామ దేవతలను తయారు చేయించి నిష్ఠతో కొలవడంతో వ్యాధి అంతమైందన్నారు. వ్యాధి తగ్గడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఊర పండుగను నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్లో ఈ నెల 13న ఊర పండుగను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రతిమల తయారీలో వడ్రంగులు నిమగ్నమయ్యారు. ఏటా ఆషాడమాసంలో నిర్వహించే ఈ పండుగకు ఐదు రోజుల పాటు నిష్టతో ఉండి 13 ప్రతిమలు తయారు చేస్తామని వడ్రంగి శ్రీనివాస్ తెలిపారు. దాదాపు 80 ఏళ్ల నుంచి మూడు తరాలుగా ఈ ఆచారం కొనసాగుతోందని ఆయన చెప్పారు. మామిడి చెట్టు నుంచి తీసుకువచ్చిన కర్రతో మాత్రమే ప్రతిమలను తయారు చేస్తామని వారు వివరించారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >