Posted on 2025-07-08 17:54:51
ఉన్నత చదువులు చదువుకోవాలన్న విద్యార్థుల కళ కళగానే మిగిలిపోతుంది..
జాగృతి తెలంగాణ నాయకులు,కేర్ కళాశాల అధినేత నరాల సుధాకర్
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు, కేర్ కళాశాల అధినేత నరాల సుధాకర్ విమర్శించారు. భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి అధ్యక్షతన యుఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మొదటి మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చెయ్యకపోవడం వలన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన కనీస స్పందన లేదని అన్నారు. అలాగే నేటి విద్యార్థులంతా ఆన్లైన్ గేమ్ లకు సోషల్ మీడియాకు బానిస కావద్దని దానివల్ల విద్యార్థి దశలో ఉన్న యువత తమ విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. భారతదేశం గర్వించదగా పౌరులుగా ఎదగాలని సూచించారు. అదేవిధంగా యుఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేస్తూ అనేక సమస్యల్ని పరిష్కరించే రకంగా కృషి చేస్తుందని ఇలాంటి విద్యార్థి సంఘాలలో విద్యార్థులు చేరి సమాజాభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. అనంతరం యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య రంగ బలోపేతానికి, ప్రభుత్వ రంగ సమస్యలను పరిష్కారానికి, ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థల దోపిడి అరికట్టడానికి సెప్టెంబర్ నెలలో యూఎస్ఎఫ్ఐ తెలంగాణ మొదటి రాష్ట్ర మహాసభల వేదికపై ఉద్యమ కార్యచరణ రూపొందించుకొని మహనీయులు కోరుకున్న సమసమాజ స్థాపన దిశకై పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బాదం తిరుపతి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు వెంకటేష్, రాజేష్, మధు,నాగేష్, తిరుపతి, గణేష్, యుఎస్ఎఫ్ఐ నిజాంబాద్ జిల్లా నాయకులు మహేష్ వేణు గణేష్ బాబురావు శివ, జవహార్,ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >