Posted on 2025-07-07 20:41:49
త్వరలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలో తమ హక్కుల సాధనకై సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తీసుకొస్తాం
వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: రాష్ట్రంలో రోజురోజుకీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు కావాల్సిన కనీస వసతులు కల్పించడంలో విఫలం చెందుతున్నారని వికలాంగుల మహిళ అధ్యక్షురాలు సూర్య వంశీ అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగులకు పింఛన్ విషయంలో 1000 రూపాయలు అదనంగా మంజూరు చేస్తామని ప్రకటించి ఇప్పుడేమో మోసం చేశారని విమర్శించారు. సోమవారం వికలాంగుల నవిపేట మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ విషయంలో న్యాయం చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పడమే కాకుండా రాష్ట్రంలో వికలాంగుల కొరకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించకపోవడం అన్యాయమన్నారు. అలాగే పెన్షన్ కూడా గత సర్కార్ కంటే వెయ్యి రూపాయలు అదనంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందించి మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే త్వరలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆమె హెచ్చరించారు.
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >