| Daily భారత్
Logo




తమ భూమి, ఇంటి స్థలాన్ని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్న మనమళ్లపై చర్యలు తీసుకోండి

News

Posted on 2025-07-07 16:00:05

Share: Share


తమ భూమి, ఇంటి స్థలాన్ని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్న మనమళ్లపై చర్యలు తీసుకోండి

ప్రజావాణిలో వీల్ చైర్ పై వచ్చి తమ సమస్యను పరిష్కరించాలంటూ వికలాంగ వృద్ధ మహిళ వినతి

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన మేడగం వెంకటలక్ష్మి అను ఓ వృద్ధ వికలాంగ మహిళ తమపై అరాచకాలు గురిచేస్తున్న తన పెద్ద కుమారుడు రెండు ఏళ్ల నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం  జరిగిందని అప్పటినుండి తన పెద్ద కుమారుని కుమారులు వరుసకు సొంత మనుమళ్లు రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి లు తన పేరుపై ఉన్న పట్టా భూమి ఐదు ఎకరాలతో పాటు ఉమ్మడి ఇల్లును కూడా అక్రమంగా వారిని వారి పేరు మీద మార్చుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్యాంక్ ఎకౌంట్, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్కులు కూడా తమ వద్ద నుండి బలవంతంగా లాక్కొని తమ పేరు మీద వ్రాయించుకున్నారని ఇదేంటి అని అడిగితే ఎక్కువగా మాట్లాడవద్దు అతిగా ప్రవర్తిస్తే పెట్రోలు పోసి తగిలేస్తామని  బెదిరింపులకు గురి చేస్తున్నారని వృద్ధురాలు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనతో పాటు వచ్చిన తన కూతురు మనమరాళ్లు కు మీడియా వివరణ అడిగితే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారని తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆర్డిఓ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వృద్ధురాలు పేరుమీద ఉన్న భూమిని ఆమెకే చెందే విధంగా చూడాలని ఆదేశించడం జరిగిందని వారు తెలిపారు


Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >