Posted on 2025-06-27 08:16:45
డైలీ భారత్, కడప: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదం వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికి ఈ బైక్ పేలుడు సంభవించింది.
ఎలక్ట్రికల్ బైక్ పేలి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కల్పోయిన విషాద ఘటన కడప జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యర్రగుంట్ల మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామంలో ఓ ఇంట్లో రోజు మాదిరిగానే ఎలక్ట్రికల్ స్కూటర్కు చార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలోనే షాట్ సర్క్యూట్ కారణంగా బైక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బైక్ పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ(62) మంటల ధాటికి పూర్తిగా కాలిన గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >