Posted on 2025-04-30 16:47:21
మా ఆదివాసి ఎమ్మెల్యేకి ఇంత అవమానం జరగటానికి కారణం ఎవరు...?
ఎమ్మెల్యే షాడో గా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది ఎవరు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం యంగ్ అండ్ డైనమిక్ ఆదివాసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు దమ్మపేట మండలం పూసుకుంట/కట్టుకూరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పర్యటన భాగంగా మంగళవారం రోజు ఘోర అవమానం జరగటంపై ఆదివాసి సంఘాలు ఉలిక్కిపడ్డాయి
ఈ విషయంపై స్పందించిన ఆదివాసీ సంఘాలు స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకున్నారా...? లేరనుకున్నారా...? అంటూ ఘాటు విమర్శలు కురిపించినప్పటికీ అధికారులకు మాత్రం చలనం లేకుండా పోయింది
మంత్రి తుమ్మల నాగేశ్వరావు అయినా పిలిచారా లేకుండా వారంతట వారే వచ్చారా అంటూ కొందరు చెవులు కోరుకొంటున్నారు
సమర్ధించటంపై కూడా పలు విమర్శలు సమర్థవంతంగా లేవంటూ పలువురు నిపుణులు చర్చించుకుంటున్నారు దమ్మపేట మండలం పూసుకుంట మరియు కటుకూరు గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో గతంలో ద్రౌపతి ముర్మ కొంతవరకు అభివృద్ధి చేసినప్పటికీ ప్రధాన రహదారి చాలా దూరం ఉండటం పట్ల (సుమారుగా 20 కిలోమీటర్లు) అభివృద్ధికి నోచుకోలేకపోయింది గిరిజన అభివృద్ధి సంస్థ కొంత మేరకు పలు సంస్థల నుంచి వాహనాలు గాని ఇతర ఇతర లోన్లు ఇప్పించడం వంటివి ఉచ్చరించినప్పటికీ అటవీ ప్రాంతంలో నైపుణ్యం లేకుండా పోవాల్సి వచ్చింది
ఇదే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అభివృద్ధి చేసి తీరాలన్న లక్ష్యంతో ముందుకు వచ్చినప్పటికీ స్థానిక సహచరుడికి తెలియపరచకుండా వచ్చి ఒక ప్రోగ్రాం బదులు వేరువేరు ప్రోగ్రాములు కావాలనే తప్పు దోవ పట్టించడంపై అనుమానాలు వర్షాం కురుస్తుంది
కనీస మర్యాద కూడా ఇవ్వనీ స్థానిక ఎమ్మెల్యేకు ఇంతటి ఘాతుకానికి పాల్పడుతున్నది ఎందుకు...?
ఎవరి స్వలాభం కోసం....?
నిజంగా అధికారులే మరిచారా...?
లేక ఎవరైనా తప్పుదారి పట్టిస్తున్నారా...?
ఇలాంటివి మరెన్నో ప్రశ్నలు ఆదివాసి సంఘాల నుంచి బయటికి వస్తున్నాయి
ఈ విషయంపై స్పందించి జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్పందించి సమయపాలన సమయస్ఫూర్తిని స్పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసి అన్ని సంఘాల తరఫునుంచి తీవ్రవ ఉద్దితం చేస్తామని ఆదివాసి సంఘం నాయకులు హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో కారం శ్రీరాములు, వాసం వెంకటేశ్వరావు, సోయం రామ్మూర్తి, కారం బొజ్జి, వాసం పోలయ్య, తాళ్ల దుర్గయ్య, సున్నం నాగేంద్రరావు, వాడే వీరస్వామి, సోయాం వీరభద్రం, బండారు సూర్యనారాయణ, కట్రం స్వామి, వంక బాబురావు, స్వయం ముత్యాలు, తాటి శ్రీను, తాటి వెంకటేశ్వర్లు, జక్కం శ్రీను, గడ్డం వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >