Posted on 2025-04-27 20:08:51
- తగలబెట్టిన ద్విచక్ర వాహనం
- కారు అద్దాలు ధ్వంసం
న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు చల్ల ఉమారవి
డైలీ భారత్, మరిపెడ: ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా...తమ్ముడు భార్యపై అన్న పెట్రోల్ తో దాడి చేయగా త్రుటిలో తప్పించుకొని పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది...అలాగే ఇంటిముందు పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు.. ఈ సంఘటన మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామంలో చోటుచేసుకుంది.. బాధితులు చల్ల ఉమారవి తెలిపిన వివరాల ప్రకారం ఐదు ఎకరాల భూమి విషయంలో గత పది సంవత్సరాల నుండి మా అన్న అయినా చల్ల సత్యనారాయణ భూ విషయంలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని,భూమిపై వస్తే బెదిరింపులకు గురి చేస్తూ వస్తున్నారన్నారు..మా తల్లిదండ్రులు చల్లా మల్సూర్ ఉపేంద్ర కు ముగ్గురు సంతానమని పెద్దవాడైన సత్యనారాయణ భూమి విషయంలో కన్న తల్లిదండ్రులకు,తోడబుట్టిన అన్నదమ్ములకు ఇబ్బందులకు గురి చేస్తూ ఒక్కరే భూమిని ఆక్రమించుకొని తింటున్నారన్నారు.. ఈ విషయమై రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని పోలీసులు ముగ్గురు సమభాగం తీసుకోవాలని తీర్పు చెప్పారన్నారు.. అందులో భాగంగానే 5 ఎకరాల మామిడి తోటలో నా భాగంలో నేను మామిడికాయలు కోస్తూ ఉండగా, పెట్రోల్ బాటిల్ తో వచ్చే నా భార్య పై దాడి చేయగా త్రుటిలో తప్పించుకుందని,పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయిందని,అలాగే కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లతో కొట్టి అనరాని మాటలు తిడుతూ చంపేస్తానని బెదిరించారన్నారు.. రాజకీయ పలుకుబడితో నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో అన్న అయినా సత్యనారాయణ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, వీరారం గ్రామంలో బతకడానికి ఇబ్బందిగా ఉందని పోలీస్ వారు నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు...అన్న చల్ల సత్యనారాయణ తో మాకు ప్రాణహాని ఉందని తెలిపారు...
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >